ఓం నమో పరమాత్మయే నమః
మనం అందరం
భగవంతునిని ఒక విగ్రహ ప్రతిమ రూపంలో భావిస్తూ కొలుస్తుంటాం. ఆ విగ్రహానికి పూజలు
చేస్తాం, దానినే దైవారాధన అని అంటాం. అదేలాగు నైవేద్యం కూడ సమర్పిస్తాం. దీనినే
భగవంతునిని ఒక విరాట్ స్వరూపంగా భావించి కొలవడం. కాని దీనినే జ్ఞానంతో ఒక మంచి
భావంతో అదే విధానాన్ని వేరేగా అలోచించి చేస్తే మన మనస్సు ఇంకా త్వరగా భగవంతుని
కోసం ఆరాటపడుతుంది. ఇప్పుడు నేను చెప్పే ఈ విషయాన్ని నేను చెప్పడం కాదు. చాల
ఆధ్యాత్మిక పుస్తకాలో వ్రాసినేదే.
నిజానికి భగవంతుని
రూపం లేదు. భగవంతుడు నిరాకారుడు, శాశ్వతుడు, సత్యుడు, నిత్యుడు, సర్వాంతర్యామి
మరియు కనిపించే ఈ నశ్వర ప్రకృతి మొత్తం తానే అయినాడు. కావున మనకు కనిపించే ప్రకృతే
ఆ భగవంతుని విరాట్ స్వరూపంగా భావించాలి. మనం ప్రతిరోజూ చేసే పనులు (కర్మలు)
అన్నియును దైవారాధనగా భావించి చేయాలి. మనం చేసిన పనుల యొక్క కర్మఫలాలను భగవంతునికి
నైవేద్యంగా సమర్పించాలి. ఇదియే నిజానికి భగవంతునిని మనస్పూర్తిగా ఆరాదించడం
అవుతుంది. భగవంతుడు కోరుకునేది కూడ నీ కర్మ ఫలాలను నాకు సమర్పించు. భగవద్గీతలో శ్రీ
కృష్ణ భగవానుడు అర్జునకు తెలియజేసేది కూడ ఇదే.