My Blog List

My Blog List

Sunday, December 22, 2013

మనస్సును నియంత్రించడం ఎలా?


ఓం నమో పరమాత్మయే నమః 

మనసు అంటే ఏమిటి, అది ఎలా ఏర్పడింది అనేది ఇంతకూ ముందు మనం తెలుసుకున్నాము, అంతేకాక దీనిని ఎందుకు జయించాలో కూడ తెలుసుకున్నాము. ఇప్పుడు ఈ మనస్సును ఎలా నియంత్రించాల అనే విషయాన్ని చూద్దాము.

నిజానికి ఈ మనస్సు చాల చంచలమైనది, ఎంతగా అంటే సముద్రములో అలలు ఏ విధంగా ఆగకుండా వస్తూనే ఉంటాయో అదేలాగు ఈ మనస్సులో కూడ చలనాలు నిరంతరం vవస్తూనే ఉంటాయి. ఇంతటి చంచలమైన మనస్సును నియంత్రించడం అంటే ఒక రకంగా చూసుకుంటే కష్టమే. కాని దీనిని నియంత్రించవచ్చు. దీనిని నియంత్రించడానికి మూడే మూడు సాధనాలు ఉన్నాయి. అవియే జ్ఞానం, వైరాగ్యం మరియు యోగాభ్యాసం. ఈ మూడు సాధనాల ద్వార ఎంతటి వాడికైనా ఈ మనస్సు లొంగుతుంది.    
ఈ జ్ఞానవైరాగ్యాలతో పాటు మరీ ముఖ్యంగా కామ.క్రోద,లోభ,మోహ,మద,మాత్సార్యాలు అను అరిషడ్వర్గాలను అదుపులో ఉంచడం మరీ ముఖ్యమైన విషయం. ఎందుకంటే ఈ అరిషడ్వార్గాల మూలంగానే మనసు ముఖ్యంగా కలత చెందుతుంది. అందువలన మొదట మనం అందరం వీటిని సంపూర్ణంగా వదిలివేయాలి. ఎప్పుడైతే వీటికి మనం దూరం అవుతామో, అప్పుడు మన మనస్సుకు ఒక నిశ్చలతత్వం వస్తుంది. అప్పుడు సుక్ష్మాతి సూక్ష్మమైన జ్ఞానం తొందరగా అవగతమవుంది. ఎప్పుడైతే జ్ఞానం మనకు అవగతమవుతుందో, అప్పుడు automatic గా కనిపించే వీటి అన్నిటిమీదా ఒక వైరాగ్య భావన మనస్సుకు కలుగుతుంది, ఎందుకంటే కనిపించే ఇవన్ని ఎప్పటికైనా నశిస్తాయి కదా...నశించిన ఇవి అన్నియు మరల ఒక శక్తిగా మారుతాయి కదా. అంటే నేను ఇన్నాళ్ళు తెలియక ఈ నశించే వీటి కోసమా ఎంపర్లాడుతున్నాను అనే సంపూర్ణ వైరాగ్యం మనస్సుకు స్థిరపడుతుంది. ఎప్పుడైతే వైరాగ్యం మనస్సుకు కలుగుతుందో, అప్పుడు నిత్యమైన దాని కోసం పరుగుపెడుతుంది. అప్పుడు యోగాభ్యాసం (ధ్యానం) మీదకు మనస్సు మరలుతుంది. ఎప్పుడైతే యోగాభ్యాసం చేయడం మొదలవుతుందో, అప్పటి నుండే మనసు సంపూర్ణంగా ఒక నిశ్చల స్థితికి వస్తుంది. అలా నిశ్చల స్థితిలో ఉన్న మనస్సు, ప్రతీ రోజు యోగాభ్యాసం అవలంబించడం వలన మనం సమాధి స్థితికి వెళతాము.   
మన మనసు ఎప్పుడు అయితే ఒక నిశ్చల స్థితికి వస్తుందో అప్పుడు మనస్సు లయించబడుతుంది. ఈ విధంగా లయించబడిన మనస్సు, ధ్యానంలో ఒకే ఒక వస్తువును ధ్యానించటం ద్వార నశించబడుతుంది. లయించిన మనస్సు మళ్ళీ పుట్టే అవకాశము ఉంటుంది, కాని నశించిన మనస్సు మళ్ళీ పుట్టదు. ఈ విధంగా మనస్సును నశింపజేస్తే, మనకు ఆ భగవంతుని దివ్య దర్శనం హృదయంలో తొందరగా అవుతుంది.
మనం ఎంత తొందరగా అరిషడ్వర్గాలను జయిస్థామో అంత తొందరగా మనస్సు లయమవుతుంది. ఈ విధంగా లయమయిన మనస్సు జ్ఞాన వైరాగ్యాలు మరియు యోగాభ్యాసంచేత నశింపబడుతుంది.    

ఈ మనస్సును నియంత్రించడానికి శ్రీకృష్ణ భగవానుడు అర్జునునికి ఈ విధంగా తెలిపాడు.
-          కామ, క్రోధ, లోభములు ఆత్మను నాశమును చేయును. అవి నరకప్రాప్తికి హేతువులు కావున, వానిని వదలి వేయవలెను.
-          విషయవాంఛలను గూర్చి సదా మననము చేయువానికి, వాని యందను రాగమధికమై, అది కామముగా మారి చివరకు క్రోధమగును. క్రోధమువలన అవివేకము కలుగును. దీనివలన జ్ఞాపకశక్తి నశించి దాని ఫలితముముగా మనుజుడు బుద్ద్దిని కోల్పోయి చివరకు అధోగతి చెందును.
-          అనురాగము, భయము, క్రోధము వదలి నా యందు మనస్సు లగ్నము చేసి, ఆశ్రయించిన సత్పురుషులు జ్ఞానయోగము చేత పరిశుద్ధులై నా సాన్నిధ్యమును పొందిరి.
-          గాలిలేనిచోట పెట్టిన దీపము నిశ్చలముగా ప్రకాశించులాగుననే మనోనిగ్రహము కలిగి అత్మయోగమభ్యసించిన వాని చిత్తము నిశ్చలముగా నుండును.
-          అర్జునా! ఎట్టివానికైనను, మనస్సును నిశ్చలముగా నిల్చుట దుస్సాధ్యమే. అయినను దానిని అభ్యాసవైరాగ్యములచేత నిరోధింపవచ్చును.
-          పార్దా! నాయందు మనస్సు లగ్నముచేసి యెల్లకాలము యందు భక్తీ శ్రద్దలతో స్థిరచిత్తుడవై పుజించితినేని నన్నే పొందగలవు.
-          ఎవరు నాయందే మనస్సు లగ్నము చేసి, శ్రద్ధాభక్తులతో నన్ను ధ్యానించుచున్నారో అట్టివారు నాకు ప్రీతిపాత్రులు. వారే ఉత్తమ పురుషులు.

No comments:

Post a Comment