ఓం నమో పరమాత్మయే నమః
నేను ఎవరు? అనే
పదాన్ని కూడ ఉచ్చరించే స్థితిలో లేదు నేటి సమాజం. అంతగా మనుష్యులందరూ వారి వారి
పనులతో మరియు సమస్యలతో సతమతమవుతూ ముందుకు వెళుతున్నారు. అలాంటిది
వారు నేను ఎవరు? శరీరమా లేక ఆత్మనా అని తెలుసుకొనేంత సమయం ఎక్కడ ఉంటుంది. కాని
వారికి ఎన్ని పనులున్నా మరియు ఎన్ని సమస్యలున్నా, మనసు మాత్రం తన పని తానూ
చేసుకుంటూ వెళుతుంది. అది ప్రతి రోజు గుర్తు చేస్తూ ఉంటుంది. దానిని మనం
లెక్కచేయం, ఎందుకంటే అది మనకు గుర్తు చేసిన విషయాన్ని తెలుసుకోవాలంటే ఏమి చేయాలో,
ఎలా ముందుకు అడుగు వేయాలో మనకు తెలియదు కనుక. పోనీలే ఎప్పుడైనా మనకు తెలుసుకొవాల
అని ఎవరినైనా అడుగుదాము అంటే వారికి తెలియదు. పోనీలే అని వారి వారి మత గ్రంధాలు
చెదివి తెలుసుకుందాము అనుకుంటే అది సరిగా అర్ధం కాదు. అప్పుడు ఎలా తెలుసుకోవాలో
తెలియక మరల మన మన పనులలో మనం నిమగ్నమై దానిని వదిలేస్తున్నాం.
నీవు ఎవరు అన్న
విషయాన్ని మరియు దేవుడు ఎవరు అన్న జ్ఞానాన్ని తెలుపడానికి ఈ భూమి మీదకు వచ్చిన
పరమాత్మా స్వరూపులు అయిన సాయిబాబా, వీరబ్రహ్మేంద్ర స్వామి వారు బోధనలు చేసినపుడు
వారిని దేవుడు అని అంటాము, కాని వారు బోధించిన జ్ఞానాన్ని మాత్రం అంతగా
పట్టించుకోము. పైగా అప్పుడు కూడ మనం మన అల్పమైన కోరికలను కోరుకొని వారిని కూడ
ఇబ్బంది పెడతాము. వారు మన దౌర్భాగ్య పరిస్థితిని చూసి ఎట్లా వీళ్ళకు నచ్చచేప్పేది
అని మదనపడ్డారు. ఇదే విషయాన్ని సాయిబాబా స్వయంగా తన భక్తులతో ఇలా చెప్పాడు. నా
దగ్గర చాల జ్ఞాన సంపద ఉంది మరియు నేను మీకు అందరికి బంగారు వస్త్రాలు ఇద్దాము అని
అనుకుంటే, మీరు మాత్రం నా దగ్గరికి వచ్చి చినిగిపొయిన పాత వస్త్రాలను
అడుగుతున్నారు మరియు మరీ అల్పమైన కోరికలను కోరితే, నేను ఏమి చేసేది. అని అయన
భక్తులతో చెప్పి ఎంతగానో మదనపడ్డాడట.
కాని ఇక్కడ
తెలుసుకుందాం. నేను ఎవరు? నేను శరీరం అని అనుకుందాం. నేను శరీరం అని అనుకుంటే మనకు
మొదటగా వచ్చ్చే జ్ఞాపకం మన పేరు. అది ఏదైనా కావచ్చు. సరే, మనం శరీరం అనుకుంటే
ఇలానే శాశ్వతంగా శరీరంతోనే ఉంటామా అంటే, లేదు అని మొదటగా మన మనసు మనకు జవాబు
చెప్పేస్తుంది. అప్పుడు మనకు అవును మరీ నిజమే కదా, మన పూర్వీకులు ఎవరు ఇప్పుడు
లేరు. వారు అంతా చనిపోయారు కదా! అంతేకాక ఈ శరీరం శాశ్వతంగా ఉండాలని ఎన్నో తపస్సులు
చేసి మరియు ఎన్నో వరాలు పొందిన రాక్షషులు కూడ చివరకు నాశనమయ్యారు (అంటే ఈ
శరీరాన్ని విడిచారు) కదా అని మనకు గుర్తు వస్తుంది. అయితే నేను ఈ శరీరం కాదు అయితే
మరి నేను ఎవరు? అనేది ఇక్కడ మనము తెలుసుకోవలసిన విషయం ?
ఈ శరీరం నువ్వు
కాదు అనే విషయాన్ని తెలుపడానికే శ్రీ షిరిడి సాయిబాబా వారు తన భక్తులకు ఒకసారి ఈ
విధముగా చేసి చూపాడు. అది ఏమిటంటే, బాబా ఒకసారి తన భక్తులతో ‘నేను ఈ శరీరం వదలి వెళ్లి, మూడు రోజుల తరువాత
తిరిగి వస్తాను’ అని చెప్తాడు. రెండు రోజుల తరువాత భక్తులు
ఏమిచేయాలో పాలుపోక సతమతమవుతూ వుంటారు. అప్పుడు ఆ ఊరి పెద్ద, వేరే పట్టణం నుండి
వైద్యున్ని పిలుచుకొని వచ్చి శవానికి పరీక్ష చేయిస్తాడు. అప్పుడు ఆ వైద్యుడు, ఇతడు
చనిపోయాడు, బ్రతికే chance లేదు అని చెప్తాడు. అపుడు ఆ ఊరి పెద్ద దహన
సంస్కారాలు చేయండి అని చెప్తాడు. కాని ఊరి వారి అందరి బలవంతం కారణంగా వారు మూడు
రోజుల తరువాత బాబా వస్తాను అని చెప్పాడు, మూడు రోజుల తరువాత చేద్దాం అని అంటారు.
అప్పుడు అందరూ ఎదురు చూస్తూ ఉంటారు. బాబా మూడు రోజుల తరువాత మరల తన శరీరం లోకి
వస్తాడు. అప్పుడు అందరూ సంతోషిస్తారు. చూసారా, సాయిబాబా ఎంత గొప్ప ప్రయోగం చేసాడో.
దేనికి ఇది అంతా ఈ విధంగా చేయవలసి వచ్చిందంటే, ఈ శరీరాలు మీరు కాదు అని
చెప్పడానికి ఆ మహానుభావుడు ఆ విధంగా practical
గా చేసి చూపించాడు. ఎందుకంటే theoretical గా చెప్తుంటే అర్ధం చేసుకోలేకపోతున్నారు అని ఆయన ఆ విధంగా చేశాడు.
సరే నేను ఈ శరీరం
కాదు అన్నప్పుడు, నేను వేరే ఏదైనా ఉండి ఉండాలి. అంతే కదా! ఆ నేను ఎవరు? అనేది మనం
తెలుసుకుకోవాలి. “దేన్నయితే మనస్సు గ్రహించలేదో – అయినప్పటికీ,
దేని చేత మనస్సు సర్వస్వం గ్రహిస్తున్నదో, దేన్నయితే కళ్ళు చూడలేవో – అయినప్పటికీ
దేనిచేత కళ్ళు చూడగలుగుతున్నాయో, దేన్నయితే చెవులు వినలేవో – అయినప్పటికీ
దేనిచేత చెవులు వినేశక్తి పొందగాలుగుతున్నాయో, దేన్నయితే ముక్కు వాసన చూడలేదో – అయినప్పటికీ
దేని చేత ముక్కు వాసన చూడగలుగుతుందో ,అదే ఆత్మ స్వరూపం” అని కేనోపనిషత్తులో సవివరంగా వివరించారు. అంటే
మన శరీరం, మనస్సు మరియు బుద్ధి అన్నియు ఒక ఆత్మ శక్తి ద్వారానే పనిచేస్తున్నాయి. ఆ
శక్తి (ఆత్మ) మాత్రమె శాశ్వతం, అదియే నీవు. ఈ శక్తి ఎప్పుడైతే శరీరాన్ని వదలి
వెళుతుందో అపుడు ఆ శరీరం నిర్జీవమవుతుంది. అప్పుడు శరీరంలోనివి ఏవి కూడ పనిచేయవు.
మానవుని శరీరంలో
ఆత్మ రాజయితే, మనస్సు మంత్రి లేక సైన్యాధిపతి అయి నడుస్తూ ఉన్నాడు. ఆత్మ
రాజయినప్పటికీ సాక్షిమాత్రంగా సంచరిస్తూ ఉండడం వలన మంత్రే (మనస్సు) స్వతంత్రించి
నడుస్తూ అహంకారంతో ప్రవర్తించటం జరుగుతుంది. మనస్సనే మంత్రి రాజును మించిపోయి
నడుస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే మనిషి ఆత్మే నేను (అనే జ్ఞానాన్ని తెలుసుకొని) అంటే రాజే
నేను అని తన రాజ్యాన్ని పాలించాలని పూనుకొని పనిచేసుకుంటూ వెళ్ళినపుడు మంత్రి ఏమి
చెయ్యలేదు. జ్ఞానమార్గంలో ఇంద్రియాలను అంతర్ముఖం చెయ్యటం వలన మనస్సు ఆత్మలో
లయించవలసి వస్తుంది. అప్పుడు ఆత్మే రాజై శాంతి సౌఖ్యాలను అందిస్తుంది. ఎప్పుడైతే
జ్ఞానాన్ని గ్రహించి నేనే ఆత్మను (రాజును) అని తెలుసుకుంటూ ముందుకు వేలతామో
అప్పుడు మనసు (మంత్రి) అందుకు సహకరిస్తుంది.
No comments:
Post a Comment