ఓం నమో పరమాత్మయే నమః
దేవుడు అంటే English లో
GOD అని అంటారు. G
– Generator – సృష్టించేవాడు, O – Operator – పరిపాలించేవాడు, D – Destroyer – నాశనం
చేసేవాడు (లయించేవాడు). సృష్టించేవాడు బ్రహ్మ అని, పరిపాలించేవాడు విష్ణువు అని
మరియు లయించేవాడు ఈశ్వరుడు అని మన పురాణాలు మనకు తెలిపాయి. ఈ మూడు కూడ ఒకరినుండే
జరుగుతున్నాయి. ఒకరే ఈ మూడుగా మారాడు. ఒకటి (శక్తి) మూడు అయింది. అయిన మూడులో ఒకరు
అయిన బ్రహ్మ ఆ శక్తినుండే పంచభూతాలను (అగ్ని, నీరు, గాలి, ఆకాశం మరియు భూమి)
సృష్టించాడు. కనిపించే ఈ సమస్తమైన నశ్వర (నశించే) ప్రకుతి అంతా ఈ పంచభూతాలనుండే
వచ్చింది. అదేవిధంగా మనకు కనిపించే ఈ చరాచర జీవజాలం (మనుషులు, పక్షులు మరియు జంతువులు) అంతయు పంచభూతాల ద్వారానే తయారయ్యాయి.
మన కండ్లకు కనిపించని ఆ శక్తే భగవంతుడయ్యాడు. ఆ భగవంతుడు సృష్టి స్తితి, కర్త
మరియు లయగా మారినపుడు ఒక సూక్ష్మ రూప శరీర ధారి అయ్యాడు. ఆ సూక్ష్మ రూప శరీర
ధారులైన వారిని దేవతలు అంటాము. అదేలాగు కనిపించే ఈ పంచభూతాలకు, అంతరిక్షంలోని
గ్రహాలకు మరియు సూర్య, చంద్రాది మరియు నక్షత్ర్రాలకు అధిపతులు కూడ సూక్ష్మ శరీర
రూప ధారులుగా ఉన్నారు. వారినే దేవతలు అంటారు.
ఇదే విషయాన్ని
ఐతరేయోపనిషత్తులో వివరించారు, “సృష్టికి పూర్వం భగవంతుడు ఒక్కడు మాత్రమె ఉన్నాడు.
వేరొకటి అంటూ ఏదియును లేదు. లోకాలను సృష్టించాలి అని అనుకున్నాడు. సృష్టించాడు”
మరియు ““మహాచైతన్య పదార్థమైన పరమాత్మే సృష్టికర్తగాను, దేవతలగాను(పంచ భూతాల
అధిపతులగాను), ప్రకృతిగను (భూమి, ఆకాశం, గాలి, అగ్ని మరియు జలము) అనే ఐదు మౌలిక
మూలకాలుగాను అదే ఉన్నది. సమస్త ప్రాణి కోటి మరియు సమస్త జీవరాసులు కూడా ఆ ఆత్మనే
అయి వుంది. స్థావర జంగామాలు అన్నీ ఆత్మే. సమస్తం ఆత్మ మార్గదర్శకంలో
నడుచుకుంటున్నాయి. అన్ని ఆత్మలోనే నెలకొనివున్నాయి. లోకమంతా ఆత్మచే నడిపించ
బడుతోంది. సమస్తానికి ఆత్మే ఆధారం. మహాచైతన్య పదార్థమైన ఆత్మే బ్రహ్మ.”
అయితే జీవుల
జ్ఞానానికి, దృష్టికి అందని ఒకే అంశం, తత్త్వం
ఈ సృష్టికి ముందు నుంచీ వుంది. ఇప్పుడు కూడా వుంది. తర్వాత కూడా వుంటుంది. దానినే
మూల తత్త్వమనీ, భగవంతుడనీ పిలుస్తాం. దాని స్వభావాన్ని గ్రహించటం
అనేది దాదాపు అసాధ్యం. అది సాధారణ భావనకు అందనిది.సమస్త సృష్టికీ కారణభూతమే ఈ
అంశం. ఇది పరిపూర్ణమైనది. అణువు మొదలు బ్రహ్మాండం వరకు అన్నీ ఇందులోంచే
ఉద్భవించాయి. తిరిగి ఇందులోనే లయమైపోతాయి.శ్రీ కృష్ణుడు తన విశ్వరూపం గురించి
చెప్పిన సందర్భంలో కూడా దీని గురించే చెప్పాడు.
ఆ భగవంతుడిని
ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా పిలుస్తున్నారు. ఆ భగవంతుడిని వేదాలలో, ఉపనిషత్తులలో,
పురాణాలలో మరియు భగవద్గీతలో ‘పరమాత్మా’
అని. ఖురాన్ లో ‘అల్లాహ్’ అని. బైబిల్ లో ‘యోహోవా’ అని పిలిచారు. ఒక్కొక్కరు ఒక్కొక్కల పిలిచారు.
కాని అన్నియు పేర్లు ఆ భగవంతుడివే. అన్నీ ఆయనే.
మన కండ్లకు
కనిపించే ప్రతి ఒక్క జీవికి (మనుషులు, పక్షులు మరియు జంతువులు) భగవంతుడు ఒక్కడే.
అదేవిధంగా మన కండ్లకు కనిపించని దేవతలకు
(అంటే పంచభూతాల, గ్రహాల అధిపతులకు) కూడ అధిపతి ఆ భగవంతుడే. ఆ భగవంతుడు నిరాకారుడు
(ఆకారములేనివాడు).
భగవంతుడికి లేదా ఈ
అనంతత్వానికి ఒక రూపం లేదు. గుణం లేదు. చావు లేదు. పుట్టుక లేదు.అతడు ఆది
లేనివాడు. అనంతమైన వాడు. అన్నింటిలోనూ వుంటాడు. అన్నీ తానై వుంటాడు. అది లేకుండా
ఏదియును లేదు, ఉండదు. అదియే ఈ కనిపించే ఈ సమస్త సృష్టి కూడ అయి ఉంది.
ఒకసారి ఇక్కడ
కొన్ని వాక్యాలను పరిశీలిద్దాం.
భగవద్గీత :
-
ఈ
సృష్టి కార్యమునకు నేనే కర్తనైనను, శాస్వతుడను, పరమేశ్వరుడను అయినను నన్ను
వాస్తవముగా అకర్తనుగా తెలిసికొనుము. (4:13)
-
ఓ
మహోబాహొ! భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశము, మనస్సు, బుద్ధి మరియు అహంకారము అని
నా ప్రక్రుతి ఎనిమిది విధములుగా కలదు. ఎనిమిది భేదములు గల ఈ ప్రకృతిని అపరా లేక జడ
ప్రక్కృతి అని అందురు. (7:4)
-
ఇదిగాక
ఈ సంపూర్ణ జగత్తును ధరించునట్టి మరియొక ప్రకృతి కలదు. అదియే నా జీవరూప పరాప్రకృతి
అని తెలిసికొనుము. (7:5)
-
ఓ
అర్జునా! సమస్త ప్రాణులను ఈ రెండు విధములైన ప్రకృతులనుండియే పుట్టుచున్నవి. ఈ
జగత్తు యొక్క పుట్టుకయు వినాశనము నా వలననే జరుగుచున్నవి. అనగా ఈ సంపూర్ణ జగత్తునకు
నేనే కారకుడను. (7:6)
-
అనేకవిధములైన
భోగవాంఛలలో కూరుకొనిపొయినవారి జ్ఞానం అంతరించిపోవుచు. వారు తమతమ స్వభావములకు
అనుగుణముగా వారివారి నియమములను బట్టి ఇతర దేవతలను ఆరాధించురు. (7:20)
-
అల్పబుద్దులగు
భక్తులు పొందేది ఫలములు గూడా అల్పములే. ఇతర దేవతలను పుజించువారు ఆ దేవతలనే
చేరుదురు. ఎవరైతే నా స్వస్వరుపాన్ని(పరమాత్మను) గ్రహించి వారి మనసు నా యందు లగ్నం
చేస్తారో వారు నన్నే పొందుచున్నారు. (7:23)
-
పరమాత్మస్వరూపుడును(నిరాకారుడను)
అయిన నన్నే నిరంతరము అనన్య భక్తితో చింతన చేయుచు, నిష్కామ భావముతో కర్మలను చేయుచు
(అంటే కర్మఫలాన్ని భగవదర్పితం చేయుచు) సేవించువారి యోగక్షేమములను నేనే
వహించుచుందును. (9:22)
-
దేవతలను
పూజించువారు దేవలోకమును చేరుదురు. పితరులను సేవించువారు పిత్రులోకములకు
వెళ్ళుదురు. భూతప్రేతములను అర్చించువారు భూతప్రేత రూపములను పొందుదురు. నన్ను
నిరాకారుడిగా తలచి నిరంతరము ధ్యానించు,
ఆరాధించు భక్తులు నన్నే పొందుదురు. (9:25)
-
వేర్వేరుగా
గోచరించుచున్న ప్రాణులన్నియును ఒకే పరమాత్మయందు స్థితమై యున్నవనియు, అట్లే అవి
యన్నియును ఆ పరమాత్మనుండియే విస్తరించుచున్నవనియు, ఎరింగిన పురుషుడు ఆ క్షణముననే
పరబ్రహ్మను పొందుచున్నాడు. (13:౩౦)
-
అర్జునా!
ప్రపంచమున జన్మించు ఎల్లా చరాచర సమూహములకు ప్రకృతి తల్లి వంటిది. నేను తండ్రి
వంటివాడను.
No comments:
Post a Comment