ఓం నమో పరమాత్మయే నమః
బాబా
ఒకసారి భక్తులతో ఇలా అన్నారు :
మీరెక్కడ
నున్నప్పటికి, ఏమిచేసినప్పటికి నాకు తేలియునని బాగుగా జ్ఞాపకముంచుకొనుము. నేనందరి
హృదయముల పాలించువాడను, అందరి హృదయములలో నివసించువాడను, ప్రపంచమందు చరాచర జీవకోటి
నావరించియున్నాను. ఈ జగత్తును నడిపించువాడను, సుత్రదారిని నేనే. నేనే జగన్మాతను,
త్రిగుణముల సామరస్యమును నేనే. ఇంద్రియచాలకుడను నేనే. సృష్టి, స్థితి, లయ కారకుడను
నేనే. ఎవరైతే తమ ద్రుష్టి నావైపు త్రిప్పెదరో వారికి ఏ హానిగాని, బాధగాని కలుగదు.
ఎవరైతే నన్ను మరిచెదరో వారిని మాయ శిక్షించును. పురుగులు, చీమలు, దృశ్యమాన
చరాచరజీవకోటి అంతయు నా శరీరమే, నా రూపమే.
బాబా
తనభక్తుల శ్రేయస్సుకై ఇలా అనెను :
నా భక్తుని ఇంటిలో
అన్నవస్త్రములకు ఎప్పుడు లోటుండదు. నాయందే మనస్సు నిలిపి భక్తిశ్రద్దలతో
మనఃపూర్వకముగా నన్నే ఆరాధించువారి యోగక్షేమములు నేను చూచెదను.
సాయి రామ్, రహీమ్
కూడ అని అల్లా ఆయనే. దేవుడు ఆయనే, అనంతుడు ఆయనే. కబిరే నా మతం, భగవంతుడే నా కులం
అని అన్నారు.
నేననగా ఎవరు? అని
సాయిబాబా ఎన్నో సార్లు చెప్పారు. సాయిబాబా ఇలా అన్నారు. నన్ను వెదకుటకు నీవు
దూరముగాని, మరెచ్చటకుగాని వెళ్లనక్కర్లేదు. నీ నామము నీ ఆకారము విడిచినచో నీలోనే
గాక అన్ని జీవులలో, చైతన్యము లేదా అంతరాత్మ కలదని అదే నేను. దీనిని నీవు గ్రహించి,
నీలోనే గాక అన్నింటిలోను చూడుము. దీనిని నీవభ్యసించినచో సర్వవ్యాపకాత్వమనుభవించి
నాలో ఐక్యము పొందెదవు.
దైవ
సాక్షాత్కారానికి సాయిబాబా చెప్పిన పది సూత్రాలు :1. ఈ లోకం క్షుద్రమైనదని తెలిసి ఇహపర సుఖాల మీద మమకారం వదులుకోవాలి.
2. బంధ విముక్తికి నిరంతరం పాటుపడాలి.
3. ఆత్మ సాక్షాత్కారం కోరేవాడు అంతర్ముఖుడు కావాలి.
4. జ్ఞానం సంపాదించిన, దుశ్చర్యలు మానకపోతే శాంతిలేదు.
5. సత్యం, తపస్సు, అంతర్ముఖం, సదాచారం సాధకుడికి అవసరం.
6. వివేకవంతుడు శ్రేయస్సు, గొప్పతనాన్ని గ్రహించాలి.
7. ఇంద్రియ నిగ్రహం లేకపోతే గమ్యం చేరలేడు.
8. మనస్సు నిష్కామనగా, నిర్మలంగా ఉండాలి.
9. సద్గురువును ఆశ్రయించి జ్ఞానం పొందాలి. ఆత్మ నిగ్రహం అలవరచుకోవాలి.
10. అన్నిటికంటే భగవనుగ్రహం ముఖ్యం. నిరాశలో, నిశ్ప్రుహలో అది ఆశాకిరణం
No comments:
Post a Comment