నిర్వచనాలు:
తపస్సు : భగవంతున్ని(పరమాత్ముణ్ణి) నిరంతరం తపించడాన్నే ‘తపస్సు’’ అంటారు.
(భగవద్గీత)
ధ్యానం : ఒంటరిగా
కూర్చొని భ్రుమధ్యమున ద్రుష్టి నిలిపి మనసులో మరియు మనసుతో పరమాత్ముణ్ణి
ధ్యానించడాన్నే ‘‘ధ్యానం’’ అంటారు. (భగవద్గీత)
సన్యాసం : బాహ్యంగా
అన్ని పనులు చేస్తూ, అంతరంగా మనసులో సమస్తాన్ని త్యజించడాన్నే ‘‘సన్యాసం’’ అంటారు. (భగవద్గీత)
వైరాగ్యం : ప్రతి
పనిని చేస్తూ (ఆచరిస్తూ) దాని మీద అనురాగాన్ని మరియు మమకారాన్ని మనసులో వదిలి
వేయడాన్ని ‘‘వైరాగ్యం’’ అంటారు. (భగవద్గీత)
జ్ఞానం : భగవంతుడు
నిరాకారుడు మరియు నేను ఆత్మను (జ్యోతిని లేక శక్తిని) అని గ్రహించి మరియు కనిపించే
ఈ ప్రక్రుతి అంతా కూడ భగవంతుని యొక్క మాయచే నిర్మితమై భగవంతుడే అయి ఉన్నాడు. ప్రళయ
సమయంలో కనిపించే ప్రకృతి అంటా తిరిగి మరల శక్తిగా మారుతుంది అని తెలుసుకోవడమే ‘‘జ్ఞానం’’ అంటారు. (భగవద్గీత)
బ్రహ్మచర్యం:
ఆత్మజ్ఞానాన్ని తెలుసుకొని పరమాత్మ సన్నిధిలో జీవనము గడపడమే ‘బ్రహ్మచర్యం’ అంటారు.
(రమణ మహర్షి)
ప్రతి మనిషి కలిగిఉండవలసిన లక్షణాలు:
·
మదర్
థెరిస్సా లాంటి సమభావం (అంటే అందరిని సమానంగా భావించడం)
·
సాయిబాబా
లాగ నిదానత్వం, నిబ్బర మరియు శ్రద్ధ.
·
రామకృష్ణ
పరమహంస లాగ భగవంతుని దర్శనం పొందాల అన్న పట్టుదల.
·
రమణ
మహర్షి లాగ ఆత్మానాత్మ వివేకం.
·
వివేకానంద
స్వామి లాగ ఏకాగ్రత.
·
అర్జునుని
మాదిరి గురువు(శ్రీకృష్ణుడు) పట్ల వినయ విధేయతలు కలిగి ఉండాలి
·
గౌతమ
బుద్దుని లాగ ప్రశాంతంగా ఉండడం.
·
మహాత్మాగాంధీ
గారిలా అహింసావాదిగా మరియు శాంతీయుతంగా ఉండడం.
·
భక్త
ప్రహ్లాదుడిలా భగవంతుని మీద సంపూర్ణ మరియు పరిపూర్ణ విశ్వాసం .
·
భగవంతున్ని
హృదయంలో దర్శించాలని ధ్రువుడి మాదిరి కఠోరమైన దీక్ష మరియు
తపన కలిగి ఉండాలి.
·
ఆంజనేయ
స్వామి మాదిరి భగవంతుని మీద భక్తిని కలిగి ఉండాలి.
·
ఏసుక్రీస్తు
లాగ కరుణ, దయ మరియు జాలి.
No comments:
Post a Comment