My Blog List

My Blog List

Thursday, March 6, 2014

నిర్వచనాలు & ప్రతి మనిషి కలిగిఉండవలసిన లక్షణాలు


నిర్వచనాలు:
తపస్సు : భగవంతున్ని(పరమాత్ముణ్ణి) నిరంతరం తపించడాన్నే తపస్సు’ అంటారు. (భగవద్గీత)
ధ్యానం : ఒంటరిగా కూర్చొని భ్రుమధ్యమున ద్రుష్టి నిలిపి మనసులో మరియు మనసుతో పరమాత్ముణ్ణి ధ్యానించడాన్నే ‘ధ్యానం’ అంటారు. (భగవద్గీత)
సన్యాసం : బాహ్యంగా అన్ని పనులు చేస్తూ, అంతరంగా మనసులో సమస్తాన్ని త్యజించడాన్నే ‘సన్యాసం’ అంటారు. (భగవద్గీత)
వైరాగ్యం : ప్రతి పనిని చేస్తూ (ఆచరిస్తూ) దాని మీద అనురాగాన్ని మరియు మమకారాన్ని మనసులో వదిలి వేయడాన్ని ‘వైరాగ్యం’ అంటారు. (భగవద్గీత)
జ్ఞానం : భగవంతుడు నిరాకారుడు మరియు నేను ఆత్మను (జ్యోతిని లేక శక్తిని) అని గ్రహించి మరియు కనిపించే ఈ ప్రక్రుతి అంతా కూడ భగవంతుని యొక్క మాయచే నిర్మితమై భగవంతుడే అయి ఉన్నాడు. ప్రళయ సమయంలో కనిపించే ప్రకృతి అంటా తిరిగి మరల శక్తిగా మారుతుంది అని తెలుసుకోవడమే ‘జ్ఞానం’ అంటారు. (భగవద్గీత)
బ్రహ్మచర్యం: ఆత్మజ్ఞానాన్ని తెలుసుకొని పరమాత్మ సన్నిధిలో జీవనము గడపడమే బ్రహ్మచర్యం అంటారు. (రమణ మహర్షి)



ప్రతి మనిషి కలిగిఉండవలసిన లక్షణాలు:
·         మదర్ థెరిస్సా లాంటి సమభావం (అంటే అందరిని సమానంగా భావించడం)
·         సాయిబాబా లాగ నిదానత్వం, నిబ్బర మరియు శ్రద్ధ.
·         రామకృష్ణ పరమహంస లాగ భగవంతుని దర్శనం పొందాల అన్న పట్టుదల.
·         రమణ మహర్షి లాగ ఆత్మానాత్మ వివేకం.
·         వివేకానంద స్వామి లాగ ఏకాగ్రత.
·         అర్జునుని మాదిరి గురువు(శ్రీకృష్ణుడు) పట్ల వినయ విధేయతలు కలిగి ఉండాలి 
·         గౌతమ బుద్దుని లాగ ప్రశాంతంగా ఉండడం.
·         మహాత్మాగాంధీ గారిలా అహింసావాదిగా మరియు శాంతీయుతంగా ఉండడం.
·         భక్త ప్రహ్లాదుడిలా భగవంతుని మీద సంపూర్ణ మరియు పరిపూర్ణ విశ్వాసం .
·         భగవంతున్ని హృదయంలో దర్శించాలని ధ్రువుడి మాదిరి కఠోరమైన దీక్ష మరియు తపన కలిగి ఉండాలి.
·         ఆంజనేయ స్వామి మాదిరి భగవంతుని మీద భక్తిని కలిగి ఉండాలి.
·         ఏసుక్రీస్తు లాగ కరుణ, దయ మరియు జాలి.

No comments:

Post a Comment