ఓం నమో
పరమాత్మయే నమః
సృష్టి :
ఈ సమస్త సృష్టి
వుద్బవించడానికి కారణం ఏమి మరియు ఈ సమస్త సృష్టి పాలకుడు ఎవరు ఈ సమస్తం ఎవరి చేత
సృస్టింపబడుతుంది , ఎవరిచేత నాశనమవుతుంది మరియు ఎవరి ఆజ్ఞ చేత ఇది
పాలించబడుతుంది అన్న విషయాన్ని ఇందులో మనం తెలుసుకుందాం.
సహస్రయుగపర్యంతం
అహర్యద్బ్రహ్మనో విదు !
రాత్రిం యుగాసహస్రాoతాo తే
హొరాత్రవిదో జనా !! (భగవద్గీత : 8.17)
వేయి (పెక్కు)
యుగముల కాలము బ్రహ్మ (మూల ప్రకృతి) కి ఒక పగలు. అంతే కాలము తరువాత రాత్రి
ముగుస్తుంది .
అవ్యక్తాద్వ్యక్తయః
సర్వా ప్రభావoత్యహరాగమే !
రాత్ర్యాగమే
ప్రలీయంతే తత్త్రైవావ్యసoజ్ఞకే !! (భగవద్గీత : 8.18)
(బ్రహ్మ) పగలు ఆరంభమున సకలము అవ్యక్తమునుండి
వ్యక్తమగును. రాత్రి రాగానే అవ్యక్తమునందు లీనమగును. (దీనిని ఒక కల్పమందురు).
సృష్టి ఆరంభమునకు ముందు
అంతయూ శూన్యమే(ఆ శూన్యమే శక్తి అదియే భగవంతుడు). ఎక్కడను ఏమియు లేదు. సృష్టి
అరంభమవగానే శున్యము నుండి శక్తి బయల్పడి(దానినే యోగమాయ అంటారు) అతి వ్యాపింప
నారంభించెను. ఆవిధంగా శూన్యము నుండి లక్షల కోట్ల సౌర మండలాలు ఉద్భవించి వాటిలో
ప్రకృతి , పెక్కు చరాచరులు, జీవరాశులు
ఏర్పడినవి.
(ఇప్పటి సృష్టి మొదలై సుమారు 1400 కోట్ల
సంవత్సరాలైనవని ఖగోళ శాస్త్రజ్ఞులు తెలుపుతున్నారు . సుమారు 10 వేల
కోట్ల సంవత్సరాల తరువాత ఈ సృష్టిలోని సర్వస్వము శక్తిగా మారి అదృస్యమగునని
తెలుపుతున్నరు . దీని తరువాత చాల కాలమునకు మరల సృష్టి జరుగునని కొందరు ఖగోల
శాస్త్రజ్ఞుల అభిప్రాయము .)
సర్వభూతాని కౌన్తేయ
ప్రకృతిం యాన్తి మామికామ్ !
కల్పక్షయే
పునస్తాని కల్పాదౌ విసృజామ్యహమ్ !! (భగవద్గీత
: 9:7)
కల్పాంతమున సకల
భూతాలు (మూల ప్రకృతి , పంచభూతాలు, సకల ప్రాణులు ..) నా ప్రకృతిని (అవ్యక్తము) ప్రవేశించును. తిరిగి కల్పారంభమున వానిని నేనే సృజించుచున్నాను.
ప్రకృతిం
స్వామవష్టభ్య విసృజామి పునః పునః !
భూతగ్రామమిం
క్రుత్స్యమ్ అవసం ప్రకృతేర్వశాత్ !! (భగవద్గీత
: 9:8)
తమతమ స్వభావవశమున
పరతంత్రమైయున్న భూత సముదాయమును నా ప్రక్రుతినాశ్రయించి మాటిమాటికి వాటి
కర్మానుసారము మరలమరల పుట్టించుచున్నాను
మయాద్యక్షేణ
ప్రకృతిం సూయతే సచరాచరం !
హేతునాణేణ కౌన్తేయ జగద్విపరివర్తతే !! (భగవద్గీత
: 9:10)
నా అద్యక్షతన భౌతిక
ప్రకృతి చరచారాలను (ప్రాణుల్ని) సృస్టించును . ఆ కారణంగా జగత్తు పనిచేయుచున్నది .
భూతగ్రామ స ఏవాయం
భాత్వా భూత్వా ప్రలీయతే
!
రాత్ర్యాగమే వశ
పార్థ ప్రభవత్యహరాగమే !! (భగవద్గీత
: 8:19)
జీవ సముదయమంతయు ఈ
విధముగా మరల మరల జన్మించును (బ్రహ్మకు) రాత్రి అవగానే నశించును, (బ్రహ్మకు)
పగలవగానే జన్మింతురు. ఈ విధంగా ప్రాణి సముదాయము ప్రక్రుతివశమున మాటిమాటి కిని
ఉత్పన్నమగుచుండును. రాత్రి ప్రారంభకాలమున లీనమగుచుండును. మరల పగటి ప్రారంభ కాలమున
పుట్టుచుండును.
కానీ మోక్షమును
పొందిన వారు మాత్రం మరల మరల పుట్టరు. ఈ అవ్యక్తమునే అక్షరము అనియు అందురు. ఇదియే
పరమగతి అని, పరమపదము అనియు అందురు. (భగవద్గీత : 8:21)
అనగా ఈ సమస్త
సృష్టి వుద్బవించడానికి కారణం ఒకరే ఆయనే పరమాత్మా (అదియే శక్తి) మరియు ఈ సమస్త
సృష్టి పాలకుడు కూడ ఆయనే, ఆయన చేతనే ఈ సమస్తం సృస్టింపబడుతుంది , నాశనమవుతుంది
మరియు ఆయన ఆజ్ఞ చేత ఇది పాలించబడుతుంది.
Mee postings chala chala infromative ga unnayee andi.
ReplyDeleteThis comment has been removed by the author.
ReplyDeleteSir
ReplyDeleteParamatmadu ante yevaru ayana rupani yevaru choodaledu naku ayanni choodalani undi
Sir
ReplyDeleteParamatmadu ante yevaru ayana rupani yevaru choodaledu naku ayanni choodalani undi
Sir
ReplyDeleteparamatma ante yevaru Sri Krishna paramatma lekapote Shiva paramatma lekapote paramatmadu vere vunnada please reply sir ayana mana aatma lo darsanam istu unadu kani ayana rupani yevaru choodaledu naku ayani choodalani undi please please reply