My Blog List

My Blog List

Wednesday, November 20, 2013

గుణాలు వాటి స్వభావాలు :

ఓం నమో పరమాత్మయే నమః

గుణాలు వాటి స్వభావాలు :
భగవద్గీతలో శ్రీ కృష్ణుడు గుణాల గురించి చాల బాగ వివరణ ఇచ్చాడు. అదియే గుణత్రయవిభాగ యోగము
ఆత్మ నాశన రహితమైనది. కాని ప్రకృతివల్ల ఉద్భవించిన సత్వ రజస్ తమో గుణములు జీవాత్మను శరీరమున బంధించును. అనుచు శ్రీకృష్ణుడు ఈ మూడు గుణముల స్వభావమును, ప్రభావమును వివరించెను. అందరిలోను ఉన్న సత్వరజస్తమో గుణాల ప్రభావం వలన జీవులు భిన్నంగా ప్రవర్తిస్తున్నాయి. ఈ త్రిగుణాలు ప్రకృతితోపాటు ఉద్భవించి క్షేత్రజ్ఞుడిని క్షేత్రంలో బంధించి ఉంచుతాయి. బ్రహ్మాండమంతా భగవంతుని కారణంగానే సృజింపబడుతుంది.
త్రివిధాభవతిశ్రద్ధా, దేహినాంసాస్వభావజా
సాత్వికీరాజసీచైనా, తమసీచేతితాంశృణు ||                             (భగవద్గీత)
జీవులకు గల శ్రద్ద, పుర్వజన్మ వాసనా బలము వలన లభ్యము. అది రాజసము, సాత్వికము, తామసములని మూడు విధములుగా వున్నది.
తత్రసత్త్వంనిర్మలత్వా, ప్రకాశకమనామయమ్ |
సుఖసజ్గేనబద్నాతి, జ్ఞానసజ్గేనచానషు ||                     (భగవద్గీత)
అర్జునా! త్రిగునములలో సత్వగుణము నిర్మలమగుటంచేసి, సుఖ జ్ఞానభిలాషల చేత, ఆత్మను దేహమునందు బంధించు చున్నది.
సత్వగుణం నిర్మలమైనది, ప్రకాశింపజేయునది, జీవునికి సుఖంపట్ల మరియు జ్ఞానం పట్ల ఆసక్తిని పెంచి జీవుని బంధిస్తుంది.
రజోరాగ్మాతకంవిద్ధి, తృష్ణాసజ్జిసముద్భవమ్ |
తన్నిభధ్గ్నాతికౌన్తేయ, కర్మసజ్గేనదేహినమ్ ||                                    (భగవద్గీత)
ఓ కౌన్తేయ ! రజోగుణము కోరికలయందు అభిమానము అనురాగము పుట్టించి, ఆత్మను బంధించుచున్నది.
రజోగుణం ఇంద్రియ విషయాలపై అనురక్తిని, తృష్ణను కలుగజేసి జీవుని నిరంతర కార్య కలాపాలలో బంధించి ఉంచుతుంది.
తమస్త్వజ్ఞానజంవిద్ధి, మోహనంసర్వదేహినామ్
ప్రమాదలస్యనిద్రభి: తన్నిభాద్నాతిభారతా ||                                     (భగవద్గీత)
అర్జునా ! అజ్ఞానము వలన బుట్టునది తమోగుణము, అది సర్వప్రాణులును మొహింపజేయునది .ఆ గుణము, మనుజుచి ఆలస్యముతోను, అజాగ్రత్తతోను, నిద్రతోను బద్దునిజేయును. 
తమోగుణం అజ్ఞానం వలన కలుగుతుంది. భ్రమ, అజాగ్రత్త, నిద్ర, సోమరితనం వంటి వాటిలో జీవుని బంధిస్తుంది.

సత్వ గుణం వలన జ్ఞానము, రజోగుణం వలన లోభము, తమోగుణం వలన మూఢత్వము కలుగుతాయి.
మనవమనాయో: తుల్యస్తుతుల్య:మిత్రారిపక్షయో:
సర్వారంభపరిత్యాగీ, గుణాతీతస్స ఉచ్యతే ||                                      (భగవద్గీత)
మానవమానములయందు, శత్రుమిత్రులయందు సమమైన మనస్సు గలవానిని త్రిగుణాతీతుడందురు.
తేజక్షమద్రుతిశ్సౌచం, అద్రోహూనాతిమానితా
భవన్తిసంపదందైవీం, అభిజాతస్యభారతా ||
డమ్బోదర్పోభిమానశ్చ, క్రోధ:పారుష్యమేవచా
అజ్ఞానంచాభిజతస్యా, పార్థా! సంపదమాసురీమ్ ||                     (భగవద్గీత)
పార్థా ! సహసము, ఓర్పు, ధైర్యము, శుద్ధి, ఇతరుల వంచింప కుండుట, కావరము లేకయుండుట మొదలగు గుణములు  దైవాంశ సంభూతులకుండును. అట్లే డంభము, గర్వము, అభిమానము, క్రోదము, కఠీనపు మాటలాడుట, అవివేకము మొదలగు గుణములు రాక్షసాంశమున బుట్టిన వారికుండును .
త్రివిధంనరకస్యేదం, ద్వారంనాశనమాత్మన:
కామ:క్రోధస్థథాలోభ;, తస్మాదేత్త్రయంత్యజేత్ ||                                    (భగవద్గీత)
కామ, క్రోధ,లోభములు ఆత్మను నాశనము చేయును. అవి నరక ప్రాప్తికి హేఅతువులు కావున, వాటిని వదలి వేయవలెను.
యజన్తేసాత్వికాచేవాన్, యక్షరక్షాంసీరాజసా:
ప్రేతాన్భూతగణంశ్చాన్న్యే , యజన్తేతామసాజనా: ||                    (భగవద్గీత)
సత్వగుణులు దేవతలను, రజోగుణులు యక్షరాక్షసులును, తమోగుణులు భూతప్రేతగణంబులను శ్రద్ధాభక్తులతో పూజించు చుందురు.
-దేనినీ ద్వేషింపకుండా, కాంక్షించకుండా, సమత్వంతో నిర్మ మనస్కుడైనవాడు అమృతత్వాన్ని పొందుతాడు. భగవంతుని అచంచల భక్తి విశ్వాసాలతో ఆరాధించేవాడు గుణాతీతుడై బ్రహ్మ పదాన్ని పొందడానికి అర్హుడౌతాడు.

No comments:

Post a Comment