My Blog List

My Blog List

Wednesday, November 20, 2013

దేవుని ప్రతిమను ఎందుకు కొలవాలి ?

ఓం నమో పరమాత్మయే నమః

దేవుని ప్రతిమను ఎందుకు కొలవాలి ?
ఇక్కడ ఒక విషయం చెప్పాలి అది ఏమిటంటే మనం చిన్నప్పటి నుండి మన పెద్దలు ఆచరించే వ్యవహార శైలిని మనం తూచ తప్పకుండ పాటిస్తూ వస్తున్నాము. కానీ వాళ్ళు దాని అంతరార్ధాన్ని మాత్రం వివరించలేకపోతున్నారు. ఎందుకంటే వాళ్ళు కూడ ఎదో దేవుని ప్రార్ధన చేసుకున్నాము ఈ రోజు ఒక పని అయిపోయింది అనుకోని అలానే కాలాన్ని వేల్లదీస్తురావడమే, కానీ ఇక్కడ వున్నా వేదాంత విషయం ఏమిటంటే దేవుని ప్రతిమను కొలవడం అంటే పరిపరివిధాల పోయే మన మనస్సును ఒక చోట నిలిపి ఆ పరమాత్ముని మీదకు మరల్చడానికి ఆ దేవదేవుని దివ్య దర్శనాన్ని మన అంతరంలోనే దర్శించడానికి మన పెద్దలు ఎంతగానో అలోచించి అలా చేయవలసి వచ్చింది.  
కావున మిత్రులారా మీరు అందరు ఈ రోజునుండే ఇప్పటి నుండే ఈ అంతరార్ధాన్ని గ్రహించి మీ మనస్సును పరిశుద్ధం చేసి ఆ మనస్సును మీ అంతరంలో అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన ఆ స్వయంప్రకాసకుడైన ఆ చిదానంద స్వరుపుడి మీదకు మీ మనస్సును మరల్చి ఆ దేవదేవుని దివ్య స్వరూపాన్ని మీ హృదయంతరంలో దర్శించుకొని తరించవలసిందిగా నా మనవి.

No comments:

Post a Comment